మంజీరా మాల్ పై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య..
దిశ, కూకట్పల్లి : నగరంలోని కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో గల కేపీహెచ్బీ కాలనీ మంజీరా మాల్ 18వ అంతస్థుపై నుంచి దూకి శుక్రవారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం.. మంజీరా త్రినిటి కార్పొరేట్ కార్యాలయంలో గేట్ నంబర్ ఒకటి వద్ద ఓ యువకుడు రక్తపు మడుగులో పడి ఉన్నట్టు మంజీరా మాల్ సెక్యూరిటీ సూపర్ వైజర్ వాకిటి భూపాల్ రెడ్డి కంట్రోల్ రూంనకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న […]
దిశ, కూకట్పల్లి : నగరంలోని కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో గల కేపీహెచ్బీ కాలనీ మంజీరా మాల్ 18వ అంతస్థుపై నుంచి దూకి శుక్రవారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం.. మంజీరా త్రినిటి కార్పొరేట్ కార్యాలయంలో గేట్ నంబర్ ఒకటి వద్ద ఓ యువకుడు రక్తపు మడుగులో పడి ఉన్నట్టు మంజీరా మాల్ సెక్యూరిటీ సూపర్ వైజర్ వాకిటి భూపాల్ రెడ్డి కంట్రోల్ రూంనకు సమాచారం ఇచ్చాడు.
వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న కేపీహెచ్బీ పోలీసులు వివరాలు సేకరించారు. మృతి చెందిన వ్యక్తి సోమర భూపతి రెడ్డి (25)గా గుర్తించారు. మృతుడు 18వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించినట్టు సీఐ తెలిపారు. మృతుడు భూపతి రెడ్డి 17వ అంతస్థులో గల ఎంఎస్సీ సర్వీస్ సెంటర్లో పని చేస్తున్న ఓ వ్యక్తిని కలవడానికి వచ్చినట్టు తెలిసిందని సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. అయితే, ఆ యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. ప్రాథమికంగా లభించిన వివరాల ఆధారంగా మృతుడి పేరు మాత్రమే కనుగొన్నట్టు పోలీసులు తెలిపారు.