బొలెరో ఢీకొని వ్యక్తి మృతి

దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలో బుధవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. మృతుని భార్య కథనం ప్రకారం.. చదరాసుపల్లి శ్రీనివాస్(45) నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో లక్కారంలోని ఎల్లప్ప హోటల్ సమీపంలో గల జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో విజయవాడ వైపు వెళ్తున్న బొలెరో పాల వాహనం వెనుక నుంచి […]

Update: 2020-10-28 09:32 GMT

దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలో బుధవారం రాత్రి వెలుగులోకి వచ్చింది.

మృతుని భార్య కథనం ప్రకారం.. చదరాసుపల్లి శ్రీనివాస్(45) నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో లక్కారంలోని ఎల్లప్ప హోటల్ సమీపంలో గల జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో విజయవాడ వైపు వెళ్తున్న బొలెరో పాల వాహనం వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు శ్రీనివాస్, అతని భార్య నాగమణి గత ఐదేండ్లుగా ఎల్లప్ప హోట‌ల్లో పనిచేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు డ్రైవర్ శివ నాగరాజు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ వెంకన్న గౌడ్ తెలిపారు.

Tags:    

Similar News