ఆజన్మాంతం పాటుపడిన వ్యక్తి ఎల్లయ్య

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి పట్ల రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి తమను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఆరు సార్లు లోక్ సభ సభ్యుడిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహించిన ఎల్లయ్య తెలంగాణలోని బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆజన్మాంతం పాటుపడ్డారన్నారు. నంది […]

Update: 2020-08-08 03:40 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి పట్ల రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి తమను తీవ్రంగా కలచి వేసిందన్నారు.

ఆరు సార్లు లోక్ సభ సభ్యుడిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహించిన ఎల్లయ్య తెలంగాణలోని బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆజన్మాంతం పాటుపడ్డారన్నారు. నంది ఎల్లయ్య మృతి రాష్ట్ర ప్రజలకు తీరని లోటు అన్నారు. ఎల్లయ్య కుటుంబ సభ్యులకు వారు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News