మే 14 వరకు పాస్ పోర్ట్ కేంద్రాలు బంద్

దిశ, తెలంగాణ బ్యూరో: పాస్‌పోర్ట్ కేంద్రాలను బంద్ చేస్తున్నట్టుగా హైదరాబాద్ రిజనల్ పాస్‌పోర్ట్ కేంద్రం ప్రకటించింది. మే 14వరకు పాస్‌పోర్ట్ కేంద్రాల్లో ఎలాంటి సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. పాస్‌పోర్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రీషెడ్యూల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పాస్‌పార్ట్ సేవలను మే 17 నుంచి తిరిగి విడతల వారిగా ప్రారంభిస్తామని చెప్పారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. బేగంపేట అమీర్‌పేట, టోలీచౌకీ, నిజామాబాద్, కరీంగనగర్ ప్రాంతాల్లోని పాస్‌పోర్ట్ కేంద్రాల్లో […]

Update: 2021-04-30 11:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పాస్‌పోర్ట్ కేంద్రాలను బంద్ చేస్తున్నట్టుగా హైదరాబాద్ రిజనల్ పాస్‌పోర్ట్ కేంద్రం ప్రకటించింది. మే 14వరకు పాస్‌పోర్ట్ కేంద్రాల్లో ఎలాంటి సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. పాస్‌పోర్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రీషెడ్యూల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పాస్‌పార్ట్ సేవలను మే 17 నుంచి తిరిగి విడతల వారిగా ప్రారంభిస్తామని చెప్పారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు.

బేగంపేట అమీర్‌పేట, టోలీచౌకీ, నిజామాబాద్, కరీంగనగర్ ప్రాంతాల్లోని పాస్‌పోర్ట్ కేంద్రాల్లో 50శాతం మేర సేవలు తగ్గించనున్నమని ప్రకటించారు. ఈ అసౌఖర్యాన్ని వినియోదారులు గుర్తించి దరఖాస్తులు చేసుకోవల్సిందిగా సూచించారు. కరోనా లక్షణాలున్న వినియోదారులు వారికి కేటాయించిన షెడ్యూల్ తేదీలను మార్చుకోవల్సిందిగా తెలియజేశారు.

Tags:    

Similar News