బీజేపీ ఆఫీస్ వద్ద ఫ్రూట్​ బాక్సుల్లో బాంబులు.. పోలీసులు అలర్ట్

దిశ, వెబ్‌డెస్క్ : కోల్‌కత్తాలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడిగా ఉంది. తాజాగా కోల్‌కత్తాలోని బీజేపీ ఆఫీస్ సమీపంలో బాంబులు లభించడం కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. హెస్టింగ్స్‌లోని బీజేపీ కార్యాలయానికి సుమారు 20మీటర్ల దూరంలో కోల్‌కత్తా యాంటీ రౌడీ స్క్వాడ్​ విభాగానికి చెందిన పోలీసులు 51 బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ బాంబులు ఫ్రూట్​ బాక్సుల్లో అమర్చడం గమనార్హం. మొదట బాంబులను స్థానికులు గుర్తించి పోలీసులు సమాచారం అందించడంతో.. ఘటన […]

Update: 2021-06-05 20:57 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కోల్‌కత్తాలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడిగా ఉంది. తాజాగా కోల్‌కత్తాలోని బీజేపీ ఆఫీస్ సమీపంలో బాంబులు లభించడం కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. హెస్టింగ్స్‌లోని బీజేపీ కార్యాలయానికి సుమారు 20మీటర్ల దూరంలో కోల్‌కత్తా యాంటీ రౌడీ స్క్వాడ్​ విభాగానికి చెందిన పోలీసులు 51 బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ బాంబులు ఫ్రూట్​ బాక్సుల్లో అమర్చడం గమనార్హం. మొదట బాంబులను స్థానికులు గుర్తించి పోలీసులు సమాచారం అందించడంతో.. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

Tags:    

Similar News