ఘోర ప్రమాదం.. పారిశుధ్య కార్మికులపైకి దూసుకొచ్చిన టిప్పర్

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో అతివేగంగా తూప్రాన్ నుంచి నగరానికి వస్తున్న టిప్పర్ రాంగ్ రూటులో వచ్చి ఢివైడర్ ఎక్కి కార్మికులపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి […]

Update: 2021-04-02 23:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో అతివేగంగా తూప్రాన్ నుంచి నగరానికి వస్తున్న టిప్పర్ రాంగ్ రూటులో వచ్చి ఢివైడర్ ఎక్కి కార్మికులపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

Tags:    

Similar News