కడపలో ఘోర రోడ్డు ప్రమాదం..

దిశ, వెబ్‌డెస్క్ : కడప జిల్లా నందలూరు శివారులోని హైవేపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళితే.. నందలూరు శివారులోని హైవేపై రోడ్డు దాటుతున్న మూగజీవాన్ని స్కార్పియో వాహనం వేగంగా ఢీకొట్టడంతో పల్టీలు కొట్టింది. దీంతో స్కార్పియోలో ఉన్న ఎనిమిది మందిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే కర్నూలు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే, […]

Update: 2020-08-31 23:36 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

కడప జిల్లా నందలూరు శివారులోని హైవేపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళితే.. నందలూరు శివారులోని హైవేపై రోడ్డు దాటుతున్న మూగజీవాన్ని స్కార్పియో వాహనం వేగంగా ఢీకొట్టడంతో పల్టీలు కొట్టింది. దీంతో స్కార్పియోలో ఉన్న ఎనిమిది మందిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను వెంటనే కర్నూలు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే, గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఆదోని నుంచి తిరుమలకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News