‘మతం కన్న మానవత్వమే మిన్న’

దిశ, జగిత్యాల: మొహర్రం పర్వదినాన ముస్లిం యువకులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. మానవత్వమే సమాజ హితమని చేతల్లో చాటిన ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… ఒంటరిగా జీవిస్తున్న దుబ్బరాజు అనే వృద్ధురాలు ఆదివారం మరణించింది. కరోనా వైరస్ భయంతో ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కారోబార్ రాజేందర్, మండల కో-ఆప్షన్ సభ్యుడు మొహమ్మద్ ముఖీద్‌ను సంప్రదించారు. వెంటనే స్పందించిన ఆయన వృద్దురాలి మృతదేహాన్ని […]

Update: 2020-08-30 06:11 GMT

దిశ, జగిత్యాల: మొహర్రం పర్వదినాన ముస్లిం యువకులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. మానవత్వమే సమాజ హితమని చేతల్లో చాటిన ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… ఒంటరిగా జీవిస్తున్న దుబ్బరాజు అనే వృద్ధురాలు ఆదివారం మరణించింది.

కరోనా వైరస్ భయంతో ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కారోబార్ రాజేందర్, మండల కో-ఆప్షన్ సభ్యుడు మొహమ్మద్ ముఖీద్‌ను సంప్రదించారు. వెంటనే స్పందించిన ఆయన వృద్దురాలి మృతదేహాన్ని స్మశానానికి తరలించి హిందూ సాంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మతం కన్న మానవత్వమే మిన్న అని భావించే తామీ కార్యక్రమానికి ముందుకు వచ్చామన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News