మిస్టరీగా మారిన వలస కూలీ మృతి

దిశ, కుకునూరు : పశ్చిమగోదావరి జిల్లా కుకునూరు మండల కేంద్రంలో వలస కూలీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన కొందరు తాపీ వర్కర్లు ఉపాధి నిమిత్తం కుకునూరుకు వలసవచ్చారు. ఈ నేపథ్యంలోనే వీరు మండలంలో పునరావాస నిర్మాణ కాలనీల్లో పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే మధు, శివరాం దాస్ అనే వర్కర్లు నాలుగు రోజుల క్రిందట పని కోసం వెళ్లి ఎంతకీ తిరిగిరాలేదు. వీరి కోసం గాలించిన సదరు […]

Update: 2020-12-02 07:46 GMT

దిశ, కుకునూరు : పశ్చిమగోదావరి జిల్లా కుకునూరు మండల కేంద్రంలో వలస కూలీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన కొందరు తాపీ వర్కర్లు ఉపాధి నిమిత్తం కుకునూరుకు వలసవచ్చారు. ఈ నేపథ్యంలోనే వీరు మండలంలో పునరావాస నిర్మాణ కాలనీల్లో పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే మధు, శివరాం దాస్ అనే వర్కర్లు నాలుగు రోజుల క్రిందట పని కోసం వెళ్లి ఎంతకీ తిరిగిరాలేదు. వీరి కోసం గాలించిన సదరు కూలీలు ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో మండల కేంద్రంలోని ఓ నూతన భవనం వెనకాలే ఉన్న చెట్ల పొదల్లో శివరాం దాస్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇద్దరూ కలిసి మద్యం సేవించిన తర్వాత గొడవ జరిగుండొచ్చని.. ఈ క్రమంలోనే శివరాం దాస్‌ను మధు హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

Tags:    

Similar News