NEET నిర్వహణకు NTA కసరత్తు..

దిశ, వెబ్‌డెస్క్ : మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి ఈనెల 13న దేశ వ్యాప్తంగా NEET పరీక్షను నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో 15.97లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షలకు హాజరు కానుండగా, కరోనా నేపథ్యంలో పరీక్ష కేంద్రాలను 2546 నుంచి 3843కు పెంచినట్లు ప్రకటించారు. అభ్యర్థులు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఒక్కో తరగతిలో 12మందినే పరిమితం చేయనుండగా.. ఒక్కో అభ్యర్థికి మూడు లేయర్స్ ఉన్న మాస్కులను అందజేయనున్నారు. పరీక్ష […]

Update: 2020-09-07 00:21 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి ఈనెల 13న దేశ వ్యాప్తంగా NEET పరీక్షను నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో 15.97లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షలకు హాజరు కానుండగా, కరోనా నేపథ్యంలో పరీక్ష కేంద్రాలను 2546 నుంచి 3843కు పెంచినట్లు ప్రకటించారు.

అభ్యర్థులు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఒక్కో తరగతిలో 12మందినే పరిమితం చేయనుండగా.. ఒక్కో అభ్యర్థికి మూడు లేయర్స్ ఉన్న మాస్కులను అందజేయనున్నారు. పరీక్ష రాసే క్రమంలో దీనిని తప్పక ధరించడమే కాకుండా, అయిపోయేంత వరకు తీయరాదని నిబంధన విధించారు.

Tags:    

Similar News