హుజురాబాద్: కరోనాతో మరో జర్నలిస్టు మృతి

దిశ,హుజురాబాద్: కరోనా మహమ్మారితో పోరాడి మరో జర్నలిస్టు మృతిచెందాడు. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలానికి చెందిన పెద్దంపేట శ్యామ్(వెలుగు రిపోర్టర్)కు ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిది. దీంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేశారు. దాదాపు 15 రోజులు ఆస్పత్రిలో కరోనాతో పోరాడి శ్యామ్, పరిస్థితి విషమించి సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన బంధువులు వెల్లడించారు. కాగా, శ్యామ్ అంత్యక్రియలు నేడు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం […]

Update: 2021-05-02 22:10 GMT

దిశ,హుజురాబాద్: కరోనా మహమ్మారితో పోరాడి మరో జర్నలిస్టు మృతిచెందాడు. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలానికి చెందిన పెద్దంపేట శ్యామ్(వెలుగు రిపోర్టర్)కు ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిది. దీంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేశారు. దాదాపు 15 రోజులు ఆస్పత్రిలో కరోనాతో పోరాడి శ్యామ్, పరిస్థితి విషమించి సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన బంధువులు వెల్లడించారు. కాగా, శ్యామ్ అంత్యక్రియలు నేడు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం తన స్వగ్రామం సైదాపూర్ గ్రామంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags:    

Similar News