కరోనా వచ్చిందని ప్లాట్‌లో బంధించి.. టార్చర్ చేస్తున్న జనం

దిశ, వెబ్‌డెస్క్: కరోనా రోగుల పట్ల వివక్ష చూపొద్దని ప్రభుత్వం ఎంత చెప్పినా.. చాలా చోట్ల పలువురు పట్టించుకోవడం లేదు. వారిపట్ల విపక్ష చూపడం, వారిని చిత్రసింహలకు గురిచేయడం వంటివి నేటికీ రోజుకోచోట దర్శనమిస్తూనే ఉన్నాయి. తాజాగా.. ఇలాంటి ఘటనే నెల్లూరు జిల్లా నవాబుపేటలో మంగళవారం చోటుచేసుకుంది. దంపతులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, ఎంఆర్ఎం అపార్ట్‌మెంట్ వాసులందరూ కలిసి వారిద్దరిని ప్లాట్‌లో బంధించి తాళం వేశారు. దీంతో వారు తిండికోసం అలమటిస్తున్నారు. అయినా.. ఏమాత్రం కనికరం […]

Update: 2021-04-20 02:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా రోగుల పట్ల వివక్ష చూపొద్దని ప్రభుత్వం ఎంత చెప్పినా.. చాలా చోట్ల పలువురు పట్టించుకోవడం లేదు. వారిపట్ల విపక్ష చూపడం, వారిని చిత్రసింహలకు గురిచేయడం వంటివి నేటికీ రోజుకోచోట దర్శనమిస్తూనే ఉన్నాయి. తాజాగా.. ఇలాంటి ఘటనే నెల్లూరు జిల్లా నవాబుపేటలో మంగళవారం చోటుచేసుకుంది. దంపతులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, ఎంఆర్ఎం అపార్ట్‌మెంట్ వాసులందరూ కలిసి వారిద్దరిని ప్లాట్‌లో బంధించి తాళం వేశారు. దీంతో వారు తిండికోసం అలమటిస్తున్నారు. అయినా.. ఏమాత్రం కనికరం లేకుండా మానవత్వం మరిచి వారిని చిత్రహింసలకు గురిచేస్తు్న్నారు. నిత్యవసర వస్తువులు, మెడిసిన్లు కొనుక్కోనివ్వకుండా వారికి టార్చర్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags:    

Similar News