‘మహా’సర్కార్ కీలక నిర్ణయం.. ఎంట్రీకి కొత్త నిబంధనలు

దిశ, వెబ్‌డెస్క్ : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అందులో సగం కేసులు మహారాష్ట్ర నుంచే వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటం, డబుల్ మ్యుటేషన్ జరుగుతుంటంతో ఆ రాష్ట్రంలోకి వచ్చేవారికి కొత్త నిబంధనలు వర్తింపజేయనుంది. దీనిప్రకారం.. రైలు ప్రయాణికులకు కొవిడ్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి చేయనుంది. గోవా, కేరళ, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ నుంచి వచ్చే వారికి […]

Update: 2021-04-19 00:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అందులో సగం కేసులు మహారాష్ట్ర నుంచే వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటం, డబుల్ మ్యుటేషన్ జరుగుతుంటంతో ఆ రాష్ట్రంలోకి వచ్చేవారికి కొత్త నిబంధనలు వర్తింపజేయనుంది.

దీనిప్రకారం.. రైలు ప్రయాణికులకు కొవిడ్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి చేయనుంది. గోవా, కేరళ, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ నుంచి వచ్చే వారికి 15రోజుల పాటు హోం క్వారంటైన్ షరతు విధించింది. ఇకపై కొవిడ్ రూల్స్ ఎవరు అతిక్రమించినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది.

Tags:    

Similar News