కరోనా మృతదేహాలను బయటకు తీసుకొచ్చిన..

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లోని కొవిడ్ కేర్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. అనంతరం పీపీఈ కిట్లను ధరించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆసుపత్రి లోపలకు వెళ్లి మంటల్లో చిక్కుకున్న కరోనా పేషెంట్లను బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని 15 అంబులెన్సుల్లో ఇతర ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన కరోనా పేషెంట్ల మృతదేహాలను కూడా వారు బయటకు తీసుకొచ్చారు. అక్కడ పరిస్థితిని కలెక్టర్ […]

Update: 2020-08-08 21:38 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లోని కొవిడ్ కేర్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. అనంతరం పీపీఈ కిట్లను ధరించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆసుపత్రి లోపలకు వెళ్లి మంటల్లో చిక్కుకున్న కరోనా పేషెంట్లను బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని 15 అంబులెన్సుల్లో ఇతర ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన కరోనా పేషెంట్ల మృతదేహాలను కూడా వారు బయటకు తీసుకొచ్చారు. అక్కడ పరిస్థితిని కలెక్టర్ ఇంతియాజ్ సమీక్షించారు.

Tags:    

Similar News