ఎలక్ట్రిక్ ఫ్లీట్‌ను ప్రారంభించిన జోమాటో.. ఒకేసారి 50 మందికి ఆర్డర్ల డెలివరీ

భారీ ఆర్డర్‌ల కోసం జోమాటో భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ ఫ్లీట్‌ను ప్రారంభించింది.

Update: 2024-04-17 08:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారీ ఆర్డర్‌ల కోసం జోమాటో భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ ఫ్లీట్‌ను ప్రారంభించింది. కొన్ని రోజుల క్రితం ప్యూర్‌వెజ్ ఆర్డర్లకు డ్రేస్ కోడ్ ను ఏర్పాటు చేయగా.. దీనిపై పెద్ద దుమారం రేగింది. దీంతో జోమాటో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కాగా తాగా.. పార్టీలు, ఇతర ఈవెంట్లకు సంబంధించిన ఆర్డర్లను సైతం తీసుకుంటున్న జోమాటో ఇందుకోసం ఏకంగా భారీ ఎలక్ట్రిక్ ఫ్లీట్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా 50 మంది వ్యక్తులకు సరిపడా అర్డర్‌లను డెలవరి చేయనుంది. జోమాటో కంపెనీ CEO దీపిందర్ గోయల్ తన ట్విట్టర్‌లో ఖాతాలో.. పెద్ద ఆర్డర్‌లను అందించడానికి "ఆల్-ఎలక్ట్రిక్ ఫ్లీట్" ఉపయోగించబడుతుంది, ఇది ఇంతకుముందు బహుళ సాధారణ ఫ్లీట్ డెలివరీ భాగస్వాముల ద్వారా అందించబడింది, ఇది ఆదర్శ కస్టమర్ అనుభవానికి దారితీసిందని రాసుకొచ్చారు.


Similar News