మణిపూర్ ఘటనలో బయటికొచ్చిన షాకింగ్ విషయాలు..!

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను ఓ గుంపు నగ్నంగా ఊరేగిస్తూ.. అసభ్యకరంగా తాకుతూ.. కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Update: 2024-04-30 18:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను ఓ గుంపు నగ్నంగా ఊరేగిస్తూ.. అసభ్యకరంగా తాకుతూ.. కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మణిపూర్ పోలీసులే మహిళలను గుంప దగ్గరికి తీసుకెళ్లారని సీబీఐ ఆరోపించింది. గతేడాది మే 4న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అయితే, ఈ కేసులో అక్టోబర్‌లో సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. అదే కుటుంబానికి చెందిన మూడవ మహిళపై గుంపు దాడి చేసి.. ఆమె దస్తులు కూడా విప్పేందుకు ప్రయత్నించిందని పేర్కొంది. కానీ, ఆమె చిన్న మనవరాలని గట్టిగా పట్టుకోవడం వల్ల విఫలమైందని పేర్కొంది. ముగ్గురు మహిళలు.. స్పాట్ లో ఉన్న పోలీసు సిబ్బంది సహాయం కోరారు. కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. చివరకు, గుంపు దయతోనే గుంపు వదిలిపెట్టారని తెలిపింది సీబీఐ. ఈ కేసులో ఆరుగురు నిందితులపై సీబీఐ ఛార్జిషీట్‌ ఫైల్ చేసింది.


Similar News