Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన పెను ప్రమాదం..

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది.

Update: 2023-06-28 05:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. పట్నా నుంచి రాంచీకి ట్రయల్ రన్‌గా వెళుతున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్‌కు బర్నాక స్టేషన్ సమీపంలో రైలుకు ఆవు అడ్డు వచ్చింది. దీంతో లోకోపైలెట్ బ్రేకులు వేసి వెంటనే ఆ ట్రైన్‌ను ఆపాడు. కాగా రైలులో ఉన్న సిబ్బంది వెళ్లి.. ఆ ఆవును పక్కకు పంపించారు. వందేభారత్ ఎక్స్ ప్రెస్‌ ట్రైన్‌ కు ఆవు ఎదురు రావడంతో నెటిజన్లు.. ప్రారంభోత్సవానికి ముందే  ఇలా జరగడం ఏంటి అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News