కోల్డ్ స్టోరేజీ పైకప్పుకూలిన ఘటనలో 10 మంది దుర్మరణం

యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. సంబల్‌లోని ఛాందౌసీ ప్రాంతంలోని కోల్డ్ స్టోరేజీ‌ పైకప్పు కుప్పకూలిన ఘటనలో మరణాల సంఖ్య 10కి చేరింది.

Update: 2023-03-17 12:27 GMT

లక్నో: యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. సంబల్‌లోని ఛాందౌసీ ప్రాంతంలోని కోల్డ్ స్టోరేజీ‌ పైకప్పు కుప్పకూలిన ఘటనలో మరణాల సంఖ్య 10కి చేరింది. మరో 10 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంటనే జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేలు ప్రకటించారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవాలని పోలీస్ దర్యాప్తుకు ఆదేశించారు. కాగా కోల్డ్ స్టోరేజీ యజమానితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News