రాజీవ్ గౌబా పదవీకాలం మరోసారి పొడిగింపు

కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడోసారి పొడిగించింది.

Update: 2023-08-03 12:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడోసారి పొడిగించింది. ఆగస్టు 30 నుంచి మరో ఏడాది కాలం పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తాజాగా వెల్లడించింది. రాజీవ్ గౌబా పదవీ కాలం పొడిగించడం ఇది మూడోసారి. 1982 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి రాజీవ్ గౌబా 2019లో కేబినెట్ కార్యదర్శిగా నియమితులు అయ్యారు. 2021 ఆగస్టులో ఆయన పదవీ కాలం ఏడాది పాటు పొడిగించగా ఆ తర్వాత 2022 ఆగస్టులో రెండో సారి పొడిగించారు.

Tags:    

Similar News