ముఖేష్ అంబానీపై దుండగుల నుంచి బెదిరింపు కాల్స్
2021లో ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన ఎస్యూవీ స్వాధీనం చేసుకున్న తర్వాత అంబానీకి ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
దిశ, వెబ్డెస్క్ : 2021లో ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన ఎస్యూవీ స్వాధీనం చేసుకున్న తర్వాత అంబానీకి ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి భద్రత రక్షణలో ఉంటున్న అంబానీపై తాజాగా దుండగులు మరోసారి బెదిరింపులకు పాల్పడ్డారు. ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ ల్యాండ్లైన్ నంబర్కు గుర్తుతెలియని నంబర్ నుంచి బాంబు బెదిరింపు వచ్చింది. ఆ కాల్లో ఆసుపత్రిని పేల్చివేస్తానని.. అంబానీ కుంటుంబలోని కొంతమంది సభ్యుల పేరుతో బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇక ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుండి వచ్చిన ఇన్పుట్ల ఆధారంగా బెదిరింపు చర్యలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ముఖేష్ అంబానీకి Z+ కేటగిరీ సెక్యూరిటీ కవర్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ 45 నుండి 50 మంది సీఆర్పీఎఫ్ కమాండో రక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అతని సతీమణి నీతా కూడా సీఆర్పీఎఫ్ నుంచి Y+ భద్రత కల్పించబడింది.