ఇవే నా చివరి ఎన్నికలు.. మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Update: 2023-05-10 06:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పూర్తి మెజారిటీ సాధిస్తుందని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 130 నుంచి 150 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. పని చేసే పార్టీనే ఎన్నుకోవాలని ఓటర్లను కోరిన సిద్దరామయ్య ఈ ఎన్నికలపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు.

ఓటర్ల నుంచి అద్భుతమైన స్పందన ఉందని, తనకు 60% కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని సిద్ధరామయ్య తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.. తాను రిటైర్మెంట్ తీసుకోనని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. ఇదే తన చివరి ఎన్నికలని సిద్ధరామయ్య పేర్కొన్నారు. పని చేసే పార్టీకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News