ఎంపీ కార్తికేయ ఎస్‌యూవీని ఢీకొట్టిన ట్రక్కు

రాజ్యసభ ఎంపీ కార్తికేయ శర్మ ఎస్‌యూవీని వెనుక నుంచి ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదం హర్యానాలోని కుండ్లి మనేసర్ పాల్వాల్ రోడ్డులో చోటు చేసుకుంది.

Update: 2023-04-24 05:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభ ఎంపీ కార్తికేయ శర్మ ఎస్‌యూవీని వెనుక నుంచి ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదం హర్యానాలోని కుండ్లి మనేసర్ పాల్వాల్ రోడ్డులో చోటు చేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో ఎంపీ కారు ఒక పక్క పూర్తిగా ధ్వంసం అయినప్పటికి అతను.. తీవ్ర ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తుంది. కాగా స్వల్ప గాయాలు కాగా.. ఆయన్ను మేదాంత ఆసుపత్రికి తరలించారు. అలాగే ఆయన పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. చర్ఖీ దాద్రి జిల్లాలో జరిగిన పరశురాముడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని గురుగ్రామ్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

Tags:    

Similar News