అమానవీయ ఘటన..మూగ కొడుకును మొసళ్ల నదిలో విసిరేసిన తల్లి..తర్వాత ఏమైందంటే?

కర్ణాటక లోని ఉత్తర కన్నడ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది.

Update: 2024-05-06 07:10 GMT

దిశ,వెబ్‌డెస్క్: సమాజంలో రోజురోజుకు మానవత్వం మంటకలిసిపోతుంది. తాజాగా కర్ణాటకలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక లోని ఉత్తర కన్నడ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. భర్తతో గొడవపడిన భార్య మూగవాడైన ఆరు ఏళ్ల కొడుకును మొసళ్లు ఉండే నదిలో విసిరేసింది. రవికుమార్, సావిత్రి దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పుట్టుక తోనే మూగవాడు. అతని జన్మించిన మొదటి నుంచి ఎందుకు అలా జన్మించవంటూ భార్యతో భర్త మూర్ఖంగా గొడవ పడేవాడు. ఇటీవల మరోసారి ఇలా గొడవ జరిగింది. భ‌ర్త గొడ‌వ‌ల‌తో విసుగెత్తిపోయిన‌ సావిత్రి ఆవేశంలో చేసిందో ఏమో కానీ మానవత్వం మరిచిపోయిన ఆమె మూగ కొడుకును తీసుకెళ్లి మొస‌ళ్లు ఉండే కాళీ న‌దిలో విసిరేసింది. సావిత్రి త‌న కుమారుడిని న‌దిలో విసిరేయ‌డం చూసిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గ‌జ ఈత‌గాళ్ల సాయంతో బాలుడి కోసం వెతికించారు. అప్పటికే పిల్లవాడు మరణించాడు. దీంతో పోలీసులు భార్యాభర్తలిద్దరినీ అరెస్టు చేశారు.

Similar News