2024 పార్లమెంట్ ఎన్నికలు.. ఒకటి, రెండు దశల్లో నమోదైన పోలింగ్ ఎంతంటే..?

2024 పార్లమెంట్ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరుగుతున్నాయి.

Update: 2024-04-30 15:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తి కాగా.. మరో ఐదు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే మొదటి, రెండో దశల పోలింగ్ లో అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు జరగడంతో రీపోలింగ్ నిర్వహించారు. రీ పోలింగ్ అనంతరం.. ఎన్నికల సంఘం రెండు దశలకు సంబంధించిన ఓటర్ టర్నౌట్ డేటాను ప్రచురించింది. ఇందులో మొదటి దశలో..66.14 శాతం పోలింగ్ నమోదు కాగా.. రెండో దశలో.. 66.71% పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. కాగా మూడో దశ పోలింగ్ ఈ నెల మే 6, నాలుగో దశ మే13న జరగనుంది.


Similar News