కన్నీరు పెట్టుకున్న రైల్వే మంత్రి

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదం తర్వాత దాదాపు 51 గంటలు నిరంతరాయంగా శ్రమించిన అధికారులు రైల్వే లైన్‌ను పున:ప్రారంభించారు.

Update: 2023-06-05 07:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదం తర్వాత దాదాపు 51 గంటలు నిరంతరాయంగా శ్రమించిన అధికారులు రైల్వే లైన్‌ను పున:ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే మంత్రి.. తప్పిపోయిన వారిని వీలైనంత త్వరగా కుటుంబాలతో కలిపేందుకు కృషి చేస్తున్నానని, మా బాధ్యత ఇంకా ముగియలేదని అన్నారు.

Tags:    

Similar News