రామ్ మందిర్ బేకార్.. దానిని వాస్తు ప్రకారం కట్టలేదు.. ఎస్సీ నాయకుడి సంచలన వ్యాఖ్యలు

అయోధ్యలో ఇటీవల నిర్మించిన రామమందిరంపై సమాజ్ వాదీ పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-07 12:17 GMT

దిశ, వెబ్ డెస్క్: అయోధ్యలో ఇటీవల నిర్మించిన రామమందిరంపై సమాజ్ వాదీ పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. అయోధ్యలో నిర్మించిన రామాలయం 'వాస్తు శాస్త్రం' ప్రకారం నిర్మించనందున దానిని "బేకార్ (పనికిరానిది)" అని వ్యాఖ్యానించారు. దీంతో ప్రస్తుతం యూపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఆయన వ్యాఖ్యలపై సీఎం యోగి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది పూర్తిగా హిందులను, రామభక్తులను కించపరచడమే అంటూ బీజేపీ నేతలు ఫై అవుతున్నారు.

Similar News