రాష్ట్రపతి ముర్ముకు అత్యున్నత పౌర పురస్కారం.. తొలి భారతీయురాలిగా రికార్డ్

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సురినామ్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం అయిన 'ది గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ఎల్లో స్టార్' అందించారు.

Update: 2023-06-06 06:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సురినామ్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం అయిన 'ది గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ఎల్లో స్టార్' అందించారు. దీనిని ఆ దేశ అధ్యక్షుడు చంద్రికాపర్సాద్ సంతోభి పారామారిబోలో రాష్ట్రపతి ముర్మకు అందించారు. దీంతో ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయురాలిగా రాష్ట్రతి నిలిచారు. ఈ సందర్భంగా.. "ఈ గుర్తింపు నాకు మాత్రమే కాకుండా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న 1.4 బిలియన్ల భారతదేశ ప్రజలకు కూడా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది" అని రాష్ట్రపతి ముర్ము అన్నారు.

Tags:    

Similar News