'ఆపరేషన్ కావేరీ'.. సూడాన్ నుంచి భారత్ చేరుకున్న మొదటి విమానం

సూడాన్‌లో నెలకొన్న హింసాత్మకమైన పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం 'ఆపరేషన్ కావేరి' ని ప్రారంభించింది.

Update: 2023-04-27 02:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: సూడాన్‌లో నెలకొన్న హింసాత్మకమైన పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం 'ఆపరేషన్ కావేరి' ని ప్రారంభించింది. ఇందులో భాగంగా వివిధ పనుల నిమిత్తం సూడాన్ వెళ్లి అక్కడే ఉండిపోయిన భారతీయులను తిరిగి భారత్‌కు 'ఆపరేషన్ కావేరీ' ద్వారా తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నంలో మొదటి.. విమానం.. ఢిల్లీలోని IGI విమానాశ్రయం చేరుకుంది. ఈ విమానంలో మొత్తం 360 మంది భారతీయ జాతీయులను స్వదేశానికి తీసుకొచ్చామని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Tags:    

Similar News