ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబ కిషోర్ దాస్ కన్నుమూత

ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబ కిషోర్ దాస్ కన్నుమూశారు.

Update: 2023-01-29 16:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబ కిషోర్ దాస్ కన్నుమూశారు. బ్రిజానగర్‌లో ఆదివారం ఉదయం ఏఎస్ఐ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఛాతీ భాగంలోకి తూటా దూసుకెళ్లడంతో మృతిచెందినట్లు అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మంత్రి నబ కిషోర్ మృతిపట్ల ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్ర షాక్‌కు గురిచేసిందని అన్నారు. ఆయన్ను కాపాడేందుకు వైద్యులు వందశాతం కష్టపడ్డారని, కానీ, దురదృష్టవశాత్తు ఆయన కోలుకోలేక పోయారని ఆవేదన చెందారు. ఆయన మరణం ఒడిశా రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. నబ కిషోర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

Tags:    

Similar News