బెంగాల్ ఎన్నికలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 35 స్థానాలు గెలిపిస్తే రామ నవమి వేడుకలు శాంతియుతంగా జరిగేలా చూస్తామని అన్నారు...

Update: 2023-04-14 11:54 GMT

కోల్‌కతా: కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 35 స్థానాలు గెలిపిస్తే రామ నవమి వేడుకలు శాంతియుతంగా జరిగేలా చూస్తామని అన్నారు. బెంగాల్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన బిర్భూంలో మాట్లాడారు. మమతా బుజ్జగింపుల వల్లే ఈ అల్లర్లు జరుగుతన్నాయని విమర్శించారు. ఒక్కసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఏ ఒక్కరూ కూడా రామనవమి వేడుకల్లో దాడులు చేసే ధైర్యాన్ని కలిగి ఉండరని అన్నారు. మమతా, అభిషేక్ నేరాలపై పోరాడాలంటే ఉన్న ఏకైక మార్గం బీజేపీనేనని చెప్పారు. రాష్ట్రంలో చొరబాటును ఆపాలంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని 35 స్థానాల్లో గెలిపించాలని కోరారు. తన అల్లుడిని ముఖ్యమంత్రి చేయడంపైనే దీదీ ఆసక్తి ఉందని దుయ్యబట్టారు. అయితే రాబోయే సీఎం బీజేపీ నుంచే వస్తారని, దానికి 2024 ఎన్నికలే ట్రైలర్ అని చెప్పారు. 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News