సీఏఏపై సందేహాలొద్దని హోం మంత్రిత్వ శాఖ స్పష్టత

దేశంలోని ముస్లింలు, ఇతర మతాలకు చెందినవారు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొంది.

Update: 2024-03-12 18:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై చాలామందిలో సందేహాలు నెలకొన్నాయి. దీని గురించి స్పష్టత ఇస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా దేశంలోని ముస్లింలు, ఇతర మతాలకు చెందినవారు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొంది. వారి పౌరసత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదని, అందిరితో సమానమైన హక్కులు వారికుంటాయని తెలిపింది. భారతీయ పౌరులు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు ఎలాంటి పత్రాలను ఇవ్వమని ఎవరూ అడగరని పేర్కొంది.  

Tags:    

Similar News