బడ్జెట్ ట్యాబ్‌తో రాష్ట్రపతి భవన్‌కు Nirmala Sitharaman

2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర పద్దును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్దిసేపట్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

Update: 2023-02-01 04:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర పద్దును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్దిసేపట్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ట్యాబ్‌తో నిర్మలమ్మ బృందం ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంది. ప్రొటోకాల్ ప్రకారం దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్మును కలిసిన ఆర్థిక మంత్రి బృందం.. బడ్జెట్ గురించి రాష్ట్రపతికి వివరించారు. అక్కడి నుంచి పార్లమెంట్‌కు బయల్దేరనున్నారు. ఉదయం 11 గంటలకు లోక్ సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Also Read...

రెండేళ్ల గ్యాప్ తర్వాత అసెంబ్లీకి గవర్నర్.. స్పీచ్‌పై ఉత్కంఠ! 

Tags:    

Similar News