గుంతల సమస్య పరిష్కారానికి కొత్త రకం తారుపై దృష్టి పెట్టిన NHAI
రోడ్లపై గుంతల కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశంలో ఎక్కువ యాక్సిడెంట్లు, మరణాలు, రోడ్లపై ఏర్పడినటువంటి గుంతల కారణంగానే ఉంటున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో: రోడ్లపై గుంతల కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశంలో ఎక్కువ యాక్సిడెంట్లు, మరణాలు, రోడ్లపై ఏర్పడినటువంటి గుంతల కారణంగానే ఉంటున్నాయి. వీటిని పూడ్చడం అధికారులకు పెద్ద సమస్యగా మారింది. దీంతో రోడ్ల నాణ్యతను మరింత పెంచడానికి అలాగే గుంతలను వేగంగా, సులభంగా పూడ్చడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశంలో కొత్త రకం టెక్నాలజీతో తారును తీసుకువస్తుంది. దీంతో రోడ్ల రిపేర్లను చాలా సులభంగా చేయవచ్చు. కొత్త తారు ఉక్కు ఫైబర్, బిటుమెన్తో నింపబడి ఉంటుంది. రోడ్డుపై గ్యాప్ ఏర్పడితే, దానిని కప్పడానికి బిటుమెన్ వేసి, స్టీల్ దారాలతో పాటు గుంతలను పూడ్చవచ్చు. దీంతో దేశంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలకు ప్రధాన కారణమైన గుంతల సమస్యకు పరిష్కారం లభిస్తుందని NHAI అధికారి చెప్పారు. దీని ద్వారా రోడ్ల నాణ్యత మరింత మెరుగవుతుంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ పరిశీలనలో ఉంది.
కొత్త టెక్నాలజీ రోడ్ల జీవితకాలాన్ని పెంచుతుందని, గుంతల వల్ల ట్రాఫిక్ అంతరాయాన్ని తగ్గించగలదని అధికారులు నమ్మకంగా చెబుతున్నారు. తారు అనేది విమానాశ్రయ రన్వేలు, పార్కింగ్ స్థలాలు, డ్రైవ్వేలతో పాటు పేవ్మెంట్లు, హైవేలను నిర్మించడానికి ఉపయోగించే స్థిరమైన పేవింగ్ మెటీరియల్. పర్యావరణ అనుకూలమైనది, రోడ్లపై వాహనాలు మృదువుగా, నిశ్శబ్దంగా ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. అయితే కొద్ది కాలం తరువాత తారు క్షీణిస్తుంది, కోతకు గురవడం, పగుళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది, ఇది చివరికి ప్రమాదకరమైన గుంతలుగా మారుతుంది. ఈ సమస్య పరిష్కారానికి కొత్త సాంకేతికతతో తారును తీసుకువస్తున్నారు.