నాకు తెలుసు నన్ను అరెస్ట్ చేస్తారని... కానీ,... : డిప్యూటీ సీఎం

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి బీజేపీ-ఆప్ మధ్య గత కొన్నాళ్ల నుంచి... Manish Sisodia's Request

Update: 2023-02-19 05:55 GMT

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి బీజేపీ-ఆప్ మధ్య గత కొన్నాళ్ల నుంచి రాజకీయ యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడారు. "నేను ప్రతిసారి కూడా సీబీఐకి సహకరిస్తున్నాను. అయితే, ఢిల్లీకి ఇది చాలా కీలకమైన సమయం. ఎందుకంటే మేం బడ్జెట్ ను సిద్ధం చేసి ఫిబ్రవరి చివరి నాటికి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. నన్ను అరెస్ట్ చేస్తారని తెలుసు అందుకే బడ్జెట్ ను ఖరారు చేసేందుకు సమయం ఇవ్వాలని సీబీఐని కోరాను" అని ఆయన మీడియాతో పేర్కొన్నారు. 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News