ఎయిర్ హోస్టెస్‌పై వేధింపులు

తాగిన మత్తులో ఓ ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్‌పై వేధింపులకు పాల్పడ్డాడు.

Update: 2023-05-15 17:04 GMT

చండీగఢ్: తాగిన మత్తులో ఓ ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్‌పై వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన దుబాయ్ నుంచి అమృత్‌సర్‌కు వస్తున్న ఓ విమానంలో తాజాగా చోటుచేసుకుంది. పంజాబ్‌లోని జలందర్ జిల్లా కోట్లీ గ్రామానికి చెందిన రాజిందర్ సింగ్ అనే వ్యక్తి, దుబాయ్ నుంచి వస్తుండగా, తాగిన మైకంలో ఏదో విషయమై ఎయిర్ హోస్టెస్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే ఆమెపై వేధింపులకూ పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయగా, నిందితుడిని ‘శ్రీ గురు రాందాస్ జీ’ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు పంజాబ్ పోలీసులు వెల్లడించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టామని తెలిపారు.

Tags:    

Similar News