కేజ్రీవాల్ కస్టడీ కేసుపై కోర్టులో విచారణ.. మద్యం తీసుకొచ్చి హల్ చల్ చేసిన వ్యక్తి
ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టుకు మద్యం సీసా తీసుకొచ్చి వ్యక్తి హల్ చల్ చేశాడు. లిక్కర్ స్కాం కేసులో ఈడీ కస్టడీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ను కోర్టు ఎదుట హాజరుపరిచారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టుకు మద్యం సీసా తీసుకొచ్చి వ్యక్తి హల్ చల్ చేశాడు. లిక్కర్ స్కాం కేసులో ఈడీ కస్టడీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ను కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఆ టైంలోనే రౌజ్ అవెన్యూ కోర్టు ఎదుట గొడవ జరిగింది. కోర్టు అవరణలోకి మద్యం తీసుకొచ్చి గొడవ చేసేందుకు యత్నించాడు. ఆ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇకపోతే కేజ్రీవాల్ కస్టడీని పొడగించాలన్న ఈడీ వినతిని రౌజ్ అవెన్యూ కోర్టు అందుకు అంగీకరించింది. ఈడీ మరో 7 రోజులు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరగా.. కోర్టు మరో 4 రోజులు కస్టడీని పొడగించింది. ఏప్రిల్ 1 వరకు ఆయన రిమాండ్ని పొడగించింది. కేజ్రీవాల్ భార్యకు చెందినదిగా భావిస్తున్న ఒక ఫోన్లోని డాటాను వెలికితీసినట్లు, విశ్లేషిస్తున్నట్లు ఈడీ పేర్కొంది. మార్చి 21న కేజ్రీవాల్ నివాసం నుంచి సీజ్ చేసిన 4 డిజిటల్ డివైజెస్ నుంచి ఇంకా సమాచారం సేకరించలేదని ఈడీ పేర్కొంది. కేజ్రీవాల్ ఈ వివరాలను అందించడానికి తన న్యాయవాదులను సంప్రదించేందుకు సమయం కోరారు.
VIDEO | Police detain a man who brought liquor in the premises of Rouse Avenue Court, where Delhi CM Arvind Kejriwal is being produced in connection with the excise policy case. pic.twitter.com/deqrsD2RZ9
— Press Trust of India (@PTI_News) March 28, 2024