నేడు ఈసీని కలవనున్న ఇండియా కూటమి నేతలు

పార్లమెంట్ ఎన్నికల వేళ ఇండియ కూటమి బీజేపీపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది.

Update: 2024-05-09 03:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ ఇండియ కూటమి బీజేపీపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. నేడు ఈసీని ఇండియా కూటమి నేతలు కలవనున్నారు. పోలింగ్ ప్రతి దశలో వాస్తవ లెక్కలు విడుదల చేయాలని డిమాండ్ చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ మత చిహ్నాలు ప్రదర్శిస్తోందని ఇండియా కూటమి నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు విపక్ష నేతలు ఎన్నికల కమిషన్‌కు వినతి పత్రం అందజేయనున్నారు. తొలి రెండు దశల ఎన్నికల సమయంలో ఓటింగ్ శాతం విడుదలలో జాప్యంపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐఎం ఇప్పటికే విడివిడిగా పోల్ ప్యానెల్‌కు లేఖ రాశాయి. ఇండియా కూటమి నేతల ఫిర్యాదుపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది.

Similar News