మోర్బీ ఘటనలో ప్రజలను స్వయంగా రక్షించిన కాంతిలాల్ భారీ మెజారిటీతో విజయం

గుజరాత్ లోని మోర్బి వంతెన కూలిపోవడంతో దాదాపు 130 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.

Update: 2022-12-08 09:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ లోని మోర్బి వంతెన కూలిపోవడంతో దాదాపు 130 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. కాగా ఆ సమయంలో అక్కడే ఉన్న కాంతిలాల్ అమృతియా ప్రజలను దగ్గరుండి కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు 130 మంది మరణించిన ఘోరమైన విషాద సంఘటన అనంతరం వచ్చిని ఎన్నికల్లో ఆయన బీజేపీ నుంచి పోటీ చేశారు. ఈ క్రమంలో మోర్బి ప్రజలు కాంతిలాల్ అమృతియాను 62 వేలకు పైగా ఓట్లతో గెలిపించారు. అమృతియా ఈ నియోజకవర్గం నుంచి గతంలో 1995, 1998, 2002, 2007 మరియు 2012 లో గెలుపొందాడు. కానీ 2017 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయాడు. కానీ ప్రస్తుతం అతను చేసిన మంచి అతన్ని అత్యంత మెజార్టీతో గెలిపించింది.

Similar News