నావీ హెలికాప్టర్‌కు తప్పిన ప్రమాదం.. ముంబై తీరంలో అత్యవసర ల్యాండింగ్

Update: 2023-03-08 11:22 GMT

ముంబై: భారత నావీకి చెందిన అడ్వాన్స్‌డ్ లైట్ కాంబొట్ హెలికాప్టర్ ముంబై తీరంలో అత్యవసరంగా నీటిపై ల్యాండింగ్ అయింది. హెలికాప్టర్ సాధారణ ఆపరేషన్‌లో ఉందని చెప్పారు. రొటిన్ ఫ్లైయింగ్ మిషన్‌లో భాగంగా సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్ దిగినట్లు అధికారులు తెలిపారు. 'ధృవ్' హెలికాప్టర్‌లోని ముగ్గురు సిబ్బందిని రక్షించినట్లు భారత నావికాదళం తెలిపింది. వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించారు.

Tags:    

Similar News