నేరం చేసినట్లు రుజువైతే నన్ను మీ బూట్లతో కొట్టి చంపండి: బ్రిజ్ భూషణ్

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత రెజ్లర్లు చేస్తున్న నిరసన తీవ్రంగా మారుతుంది. ఈ క్రమంలోనే మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ వెయిట్ చెక్ చేసేటప్పుడు తమ బాడీ పార్టులను తాకేవాడని..

Update: 2023-05-07 07:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత రెజ్లర్లు చేస్తున్న నిరసన తీవ్రంగా మారుతుంది. ఈ క్రమంలోనే మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ వెయిట్ చెక్ చేసేటప్పుడు తమ బాడీ పార్టులను తాకేవాడని.. తమని శారీరికంగా హింసించేవాడని.. తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తనపై వచ్చిన ఒక్క ఆరోపణలు నిజమని రుజువైతె తాను ఉరి వేసుకుంటానని చెప్పుకొచ్చాడు. అలాగే.. విచారణ తర్వాత నేరం రుజువైతే బూట్లతో కొట్టి చంపాలని బీజేపీ ఎంపీ ప్రజలను కోరారు. అలాగే.. నిరసన తెలిపే మల్లయోధుల వద్ద తనకు వ్యతిరేకంగా ఏవైనా వీడియోలు లేదా సాక్షాలు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News