అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది సజీవదహనం

చైనాలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షింజియాంగ్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి.. Latest Telugu News

Update: 2022-11-25 07:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనాలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షింజియాంగ్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా.. 9 మందికి గాయాలైనట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. దాదాపు మూడు గంటల సమయం పట్టిందని తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News