ఇండియాను ఎదుర్కొనే సత్తా ఉందా?.. ఎన్డీఏ, బీజేపీకి మమతా బెనర్జీ సవాలు

బెంగళూరులో రెండో రోజు జరుగుతున్న విపక్షాల సమావేశంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Update: 2023-07-18 11:28 GMT

దిశ, వెబ్ డెస్క్: బెంగళూరులో రెండో రోజు జరుగుతున్న విపక్షాల సమావేశంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎన్డీఏ, బీజేపీకి ఇండియా (INDIA)ను ఎదుర్కొనే సత్తా ఉందా అని ప్రశ్నించారు.  బీజేపీ , ఎన్దీఏ దేశ ప్రజల మధ్య విద్వేశాలను సృష్టిస్తాయని, కానీ దేశంలోని రైతులు, విద్యార్థులు, కార్మికులు, దళితులు ఇలా ప్రతి వర్గాన్ని తాము ప్రేమిస్తామని దీదీ స్పష్టం చేశారు. కాగా విపక్షాల కూటమికి ఇండియా (INDIA) అనే పేరును ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మమతా బెనర్జీ ఇండియా అని పేర్కొంది కూటమి గురించేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News