కరెంట్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం..

కరెంట్ షాక్ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని బాడ్మేర్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.

Update: 2023-09-02 09:53 GMT

దిశ, వెబ్ డెస్క్ : కరెంట్ షాక్ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని బాడ్మేర్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆరంగ్ గ్రామానికి చెందిన అర్జున్ సింగ్ కుటుంబం పిండి మర నడిపుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రోజు లాగానే అర్జున్ సింగ్ భార్య పిండిమరలో గోధుమలు వేసి ఆడిస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలింది. తల్లిని కాపాడేందుకు యత్నించిన ఇద్దరు పిల్లలు సైతం విద్యుత్ షాక్ కు గురయ్యారు. వారందరి అరుపులు విన్న అర్జున్ సింగ్ బంధువు వారిని కాపాడేందుకు యత్నించి అతను కూడా షాక్ కు గురయ్యాడు. దీంతో మొత్తం నలుగురు స్పాట్ లోనే ప్రాణాలను కోల్పోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News