బ్రేకింగ్: మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ కన్నుమూత

శిరోమణి ఆకాలీదళ్ అధినేత, పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ కన్నుమూశారు.

Update: 2023-04-25 16:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: శిరోమణి ఆకాలీదళ్ అధినేత, పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మొహాలీలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ప్రకాశ్ సింగ్ బాదల్ మరణవార్త తెలుసుకున్న రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ప్రకాశ్ సింగ్ బాదల్.. 10 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నాలుగు సార్లు సీఎంగా పని చేసిన బాదల్.. కేంద్రమంత్రిగాను సేవలందించారు. 

Tags:    

Similar News