KPCC చీఫ్ పదవికి రాజీనామాపై DK శివకుమార్ క్లారిటీ

కర్ణాటక రాజకీయం గంట గంటకు ఉత్కంఠగా మారుతోంది. హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మరోసారి

Update: 2023-05-16 12:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక రాజకీయం గంట గంటకు ఉత్కంఠగా మారుతోంది. హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను పీసీసీ పదవికి రాజీనామా చేయబోతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేయడం లేదని నా రాజీనామా వార్తలు వాస్తవం అన్నారు.

తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఏ వార్త సంస్థ అయిన తప్పుడు కథనాలు రిపోర్ట్ చేస్తే అలాంటి వారిపై పరువు నష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తనకు తల్లిలాంటిదని.. కర్ణాటకలో కాంగ్రెస్‌ను నేనే నిర్మించానన్నారు. మా పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. తనపై కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇలాంటివి మానుకోవాలని హెచ్చరించారు.

Tags:    

Similar News