దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ..

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూ.. ప్రజలను ఆస్పత్రులకు పరుగుతీయిస్తుంది.

Update: 2023-04-17 03:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూ.. ప్రజలను ఆస్పత్రులకు పరుగుతీయిస్తుంది. ఈ క్రమంలోనే గడిచిన 24 గంటల్లో (ఆదివారం) 1,634 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పొయారు. దీంతో ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 29.68%గా ఉంది. అలాగే ప్రస్తుతం ఢిల్లీ మహానగరంలో 5,297 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఢిల్లీలో శనివారం 1,396 తాజా కేసులు 31.9% పాజిటివ్‌గా నమోదయ్యాయి.

Tags:    

Similar News