నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంలో భాగంగా నిరుద్యోగుల నుంచి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది.

Update: 2024-01-19 04:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంలో భాగంగా నిరుద్యోగుల నుంచి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. అగ్నివీర్ వాయు ఇన్‌టేక్ 01/2025 సెలక్షన్‌కు ఇండియన్ నేవీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. 2004 జనవరి 17వ తేదీ నుంచి 2007 జులై 2వ తేదీ మధ్య జన్మించిన వారు దీనికి అర్హులుగా పేర్కొంది. అర్హత ఉన్న అభ్యర్థులంతా ఫిబ్రవరి 6వ తేదీలోగా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. ఏవైనా అనుమానాలు ఉంటే.. సికింద్రాబాద్ 12 ఎయిర్‌మెన్ సెంటర్‌ను 040-27753500 నంబర్‌లో లేదా Co.12asc-ap@gov.in ఈ మెయిల్ ద్వారా సంప్రదించడానికి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News