BREAKING: దేశంలో రైతులకు ప్రశ్నించే హక్కు లేకుండా చేసిన మోడీ : కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

దేశంలో రైతులకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా ప్రధాని మోడీ చేశారని కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ అన్నారు.

Update: 2024-02-15 07:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రైతులకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా ప్రధాని మోడీ చేశారని కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకే కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. అంబానీ, అదానీ లాంటి కుబేరులకు మాత్రమే కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని దుయ్యబట్టారు. దేశ రాజధాని సరిహద్దుల్లో తమ హక్కుల కోసం రైతులు ఆందోళణ చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ తరపున తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.   


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News