BREAKING: చెన్నైలోని చెంగల్‌పట్టులో తీవ్ర విషాదం.. డీఎంకే నేత దారుణ హత్య

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది.

Update: 2024-03-01 02:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. అధికార డీఎంకే నేత ఆరాముదన్‌‌ దారుణ హత్యకు గురయ్యారు. చంగల్‌పట్టు జిల్లా వండలూరుకు వెళ్లిన ఆయనను గుర్తు తెలియని దుండగులు పథకం హతమార్చారు. ముందుగా ఆయన మీదికి నాటు బాంబులు వేసి అక్కడికక్కడే దారణంగా నరికి చంపారు. ఈ క్రమంలో వండలూరులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలో చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. రాజకీయ విబేధాల కారణంగానే డీఎంకే కీలక నేత ఆరాముదన్‌ను అతడి పత్యర్థులు హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News