బీజేపీ తొలి తమిళనాడు ఎమ్మెల్యే సీ వేలాయుధం కన్నుమూత

పార్లమెంట్ ఎన్నికల వేళ తమిళనాడు బీజేపీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ తొలి ఎమ్మెల్యే సీ వేలాయుధం ఈ రోజు కన్నుమూశారు.

Update: 2024-05-08 09:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ తమిళనాడు బీజేపీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ తొలి ఎమ్మెల్యే సీ వేలాయుధం ఈ రోజు కన్నుమూశారు. ఆయన 1996 ఎన్నికల్లో పద్మనాభపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డీఎంకే ను ఓడించి ఆయన చరిత్ర సృష్టించారు. అలాగే అతను 1989లో తన మొదటి ఎన్నికల్లో పోటీ చేయడానికి తన 5 ఎకరాల భూమిని విక్రయించాడు. ఆలయాలు అతనికి డిపాజిట్ కోసం అవసరమైన మొత్తాన్ని విరాళంగా ఇచ్చాయి. తమ పార్టీ తరఫున గెలిచిన మొట్టమొదటి మాజీ ఎమ్మెల్యే మృతి చెందాడనే వార్త తెలుసుకున్న తమిళనాడు బీజేపీ చీఫ్.. అన్నామలై సంతాపం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో తమ పార్టీ అభివృద్ధి కోసం ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు.

Similar News